Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh Congress Chief: హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్లో ఓటేసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ మాట్లాడారు. తన పార్టీ 40-45 సీట్లు గెలుస్తుందని, ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ శనివారం సిమ్లాలోని రాంపూర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.
సిమ్లా రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమాదిత్యకు కాంగ్రెస్ మరోసారి బాధ్యతలు అప్పగించింది. ఆ స్థానంలో బీజేపీకి చెందిన రవి మెహతా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రేమ్ ఠాకూర్ బరిలో నిలిచారు. సిమ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్, సీపీఎంల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రతిభా సింగ్ అన్నారు. తన భర్త, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మరణం తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించేందుకు ఆమె ఎన్నికయ్యారు.
Also Read
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
Gujarat Assembly Elections: స్పీడ్ పెంచిన బీజేపీ.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల
అయితే తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చాలా మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని ఆమె అన్నారు. గత ఏడాది మరణించిన వీరభద్ర సింగ్ లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రతిభా సింగ్ చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, అందుకే కాంగ్రెస్కు అవకాశం కల్పిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!