AP Politics : ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్ల రచ్చ
ఏపీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్ల రచ్చ మొదలైంది. బెజవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉండటంతో ఆందోళనకు దిగింది జనసేన. పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలనీ ఆందోళనకు దిగింది మహేష్ వర్గం. మైలవరం టికెట్ టీడీపీ నేత బొమ్మసాని సుబ్బా రావుకి ఇవ్వాలని ఆయన వర్గం గొల్లపూడిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టే ఆలోచనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడె ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. బోడె కి టికెట్ లేదని ఇప్పటికే చెప్పేసింది టీడీపీ అధిష్టానం. అయితే.. పోతిన మహేష్ నివాసం దగ్గర మహేష్ వర్గం ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారని, పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారన్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ లో కీలక నేతలు ఎవరూ రెస్పాండ్ అవలేదని, పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు స్పందించాల్సి ఉందన్నారు మహేష్.
MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్ రెడ్డి..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కోసం జనసైనికులు స్పందించాలని, పార్టీ అధ్యక్షుడి కే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం స్పందించాలని, అలా ఎందుకు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా బయటకు వచ్చి చర్యలు చేపట్టాలని, గతంలో కూడా పవన్ ఓటమి పాలయ్యారు కాబట్టి జాగ్రత్త చర్యలు ఇప్పుడు అవసరమన్నారు. బెజవాడ పశ్చిమ సీటును జనసేన కు ఇవ్వాలని, గత 8 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానన్నారు. వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్నామని, జనసేన బలంగా ఉండబట్టే వైసీపీ సిట్టింగ్ అభ్యర్దిని మార్చేసిందన్నారు. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలని, పవన్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ జనసేనకు వచ్చిందని, గత ఐదేళ్లుగా నాతో పాటు పార్టీ నేతలు డబ్బు, సమయం రెండు కేటాయించామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!