Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi Political Heir: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు. కాషాయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినంత వరకు నా తరువాత నా కొడుకు సీఎం, పీఎం అనే కాన్సెప్ట్ లు ఉండవు. కుటుంబ రాజకీయాలు చేస్తాయని తరుచూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతగా ప్రధాని మోడీ నిలిచారు. ఇప్పటికే తనకున్న చరిష్మాతో రెండు సార్లు కాషాయ పార్టీని ఎవరు ఊహించని విధంగా అత్యధిక లోక్ సభ స్థానాలు తీసుకువచ్చి అధికారంలో నిలిపారు. అత్యంత శక్తిమంతమైన పార్టీగా బీజేపీని నిలిపారు మోడీ. ఒకటి కాదు రెండు కాదు మోడీ గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఒక్కసారి ఆయన మాట్లాడం వింటే ఎవరైనా సైలెంట్ గా వినాల్సిందే. బీజేపీలోఆయనే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్. ఎతంటి పెద్ద నిర్ణయమైనా మోడీ తీసుకోగలరు అంతేకాకుండా దానిని గట్టిగా అమలు చేస్తారు కూడా. డీమోనిటైజేషన్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఎన్నో పెద్ద నిర్ణయాలను తీసుకొని ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయని వాటిని కూడా మోడీ చేసి చూపించారు.
Also Read: Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అయితే ఇంత స్ట్రాంగ్ లీడర్ అయిన మోడీ వారసుడు ఎవరు అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. మోడీ తరువాత బీజేపీలో ఎవరు ప్రధానిగా ఉండాలి అని ప్రశ్న కొనసాగుతుంది. సూటిగా చెప్పుకోవాలి అంటే మోడీ వారసుడు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించే ఇండియా టుడే – సీ ఓటర్ సంస్థలు ఓ సర్వే నిర్వహించారు. అయితే అందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారసుడిగా అమిత్ షా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే చూస్తే అర్థం అవుతుంది. అమిత్ షా వారసుడిగా ఉండాలని 29 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారసుడి రేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. యోగికి 26 శాతం మంది, గడ్కరీకి 15 శాతం మంది మోడీ రాజకీయ వారసుడిగా తమ మద్దతు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మోడీ తరువాత అమిత్ షా వారసుడు కావాలని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!