Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi Political Heir: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు. కాషాయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినంత వరకు నా తరువాత నా కొడుకు సీఎం, పీఎం అనే కాన్సెప్ట్ లు ఉండవు. కుటుంబ రాజకీయాలు చేస్తాయని తరుచూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతగా ప్రధాని మోడీ నిలిచారు. ఇప్పటికే తనకున్న చరిష్మాతో రెండు సార్లు కాషాయ పార్టీని ఎవరు ఊహించని విధంగా అత్యధిక లోక్ సభ స్థానాలు తీసుకువచ్చి అధికారంలో నిలిపారు. అత్యంత శక్తిమంతమైన పార్టీగా బీజేపీని నిలిపారు మోడీ. ఒకటి కాదు రెండు కాదు మోడీ గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఒక్కసారి ఆయన మాట్లాడం వింటే ఎవరైనా సైలెంట్ గా వినాల్సిందే. బీజేపీలోఆయనే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్. ఎతంటి పెద్ద నిర్ణయమైనా మోడీ తీసుకోగలరు అంతేకాకుండా దానిని గట్టిగా అమలు చేస్తారు కూడా. డీమోనిటైజేషన్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఎన్నో పెద్ద నిర్ణయాలను తీసుకొని ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయని వాటిని కూడా మోడీ చేసి చూపించారు.
Also Read: Guinness World Record : ఇదో వింత స్టోరీ.. నిద్రలో నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాలుడు
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
అయితే ఇంత స్ట్రాంగ్ లీడర్ అయిన మోడీ వారసుడు ఎవరు అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. మోడీ తరువాత బీజేపీలో ఎవరు ప్రధానిగా ఉండాలి అని ప్రశ్న కొనసాగుతుంది. సూటిగా చెప్పుకోవాలి అంటే మోడీ వారసుడు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించే ఇండియా టుడే – సీ ఓటర్ సంస్థలు ఓ సర్వే నిర్వహించారు. అయితే అందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారసుడిగా అమిత్ షా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే చూస్తే అర్థం అవుతుంది. అమిత్ షా వారసుడిగా ఉండాలని 29 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారసుడి రేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. యోగికి 26 శాతం మంది, గడ్కరీకి 15 శాతం మంది మోడీ రాజకీయ వారసుడిగా తమ మద్దతు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మోడీ తరువాత అమిత్ షా వారసుడు కావాలని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..