Penamaluru Politics: పెనమలూరు టీడీపీలో అసంతృప్తులు.. మంత్రి జోగి రమేష్ గాలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penamaluru Politics: పెనమలూరు నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. పెనమలూరు టీడీపీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు మంత్రి జోగి రమేష్. బోడే ప్రసాద్ అనుచరులతో మంత్రి జోగి రమేష్ టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. బోడే ప్రసాద్కు టికెట్ రాకపోతే తనకు సహకరించాలని రాయబారాలు పంపుతున్నట్లు తెలిసింది. అయితే జోగి రమేష్ దూకుడుతో అలర్ట్ అయిన పెనమలూరు టీడీపీ నేతలు బలప్రదర్శన చేద్దామని బోడే ప్రసాద్పై ఒత్తిడి తెస్తున్నారు.
మరో వైపు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టే ఆలోచనలో మరో నేత ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి చంద్రబాబును కలిసేందుకు తుమ్మల చంద్రశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. అటు మైనార్టీ నేతల ద్వారా సీటుపై క్లారిటీ ఇవ్వాలని అధిష్ఠానం దగ్గరకు వెళ్లనున్నారు ఎం.ఎస్.బేగ్. ఇదిలా ఉంటే మైలవరం సీటు గురించి తేలేవరకు పెనమలూరుపై స్పందించకూడదని దేవినేని ఉమ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: AP High Court: టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం
పెనమలూరులో కమ్మ లేదా మైనార్టీ వర్గానికి సీటిచ్చే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి దేవినేని ఉమా, బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఎం.ఎస్ బేగ్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో ఓట్లను గణాంకాల వారీగా జల్లెడ పట్టి సర్వేలను టీడీపీ అధిష్ఠానం చేయిస్తోంది. వైసీపీ నుంచి బీసీకి చెందిన మంత్రి జోగి రమేష్ ఖరారు కావడంతో వీలైనంత త్వరగా ఇక్కడ అభ్యర్దిని ఖరారు చేయాలని పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మంత్రి జోగి రమేష్ ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!