Gannavaram Episode: టీడీపీ నేతలపై కేసులు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా గన్నవరంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. గన్నవరం ఎపిసోడులో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి.
గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
మరోవైపు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. సీఎం అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..?
Read Also: Buddha Venkanna: దమ్ముంటే రండి… తేల్చుకుందాం
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.ఈ దాడికి సూత్రధారి వంశీనే, అతని కనుసన్నల్లోనే దాడి జరిగింది. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టు నీ తల పొగరు అణిచివేస్తాం.టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని.. దమ్ముంటే రావాలంటూ వంశీకి బుద్దా సవాల్ చేశారు. ఎన్టీఆర్ సర్కిలుకు మీరూ రండి మేమూ వస్తాం.. కురుక్షేత్రమే అన్నారు. మీరో.. మేమో తేల్చుకుందాం అంటూ సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Tues Day Hanuman Chalisa Chanting Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…
తాజావార్తలు
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!