2 Thousand Crores: 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు.. ఆర్బీఐ నగదుగా తేల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Thousand Crores: ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు భారీ నగదుతో వెళ్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. 4 కంటైనర్ల నిండా నగదు పట్టుబడింది. ఒక్కో కంటైనర్ లో రూ.500 కోట్ల చొప్పున మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్టు గుర్తించారు.
Read Also: Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోంది..
Also Read
పోలీసులు ఈ కంటైనర్లలోని డబ్బుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదని తేల్చారు. ఈ రూ.2 వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్కు తరలిస్తోందని అధికారులు తెలిపారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం, కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకీ కంటైనర్లు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఆ కంటైనర్లను అధికారులు పంపించివేశారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?