Hyderabad: జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో హనీ ట్రాప్ చేసి రాము సింగోటం అనే వ్యక్తిని ఓ ముఠా హత్య చేసింది. మహిళ ద్వారా ట్రాప్ చేయించి రాము సింగోటంని జూబ్లీహిల్స్ పిలిపించి.. జూబ్లీహిల్స్ కి వచ్చిన గోల్డ్ మాన్ రాము సింగోటంపై ముకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాము సింగోటం. ఈ క్రమంలో.. రౌడీ షీటర్లకు చెప్పి రాము సింగోటంని హత్య చేయించింది మహిళ. రాముని హత్య చేసిన తర్వాత ఆధారాలు బయటపడకుండ ఉండేందుకు బాణాసంచా కాల్చింది ముఠా.
Supriya Sule: ఫోన్పే, గూగుల్పే పేలబోయే “టైమ్ బాంబులు”.. పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పాతకక్షలు, అసూయ కారణంగానే తోటి స్నేహితుడు పథకం ప్రకారం దారుణంగా అంతమొందించినట్టు తెలిపారు. జీడిమెట్లకు చెందిన మణికంఠ, రాము ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి ‘జువా’ గేమ్ ఆడేవారని, దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అన్నారు. తరచూ గేమ్లో రాము డబ్బులు గెలవడంతో మణికంఠ కక్ష పెంచుకున్నాడని.. గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరగిందని తెలిపారు. దీంతో.. రాము మణికంఠపై దాడి చేశాడన్నారు. అప్పటి నుంచి మరింత కక్ష పెంచుకున్నాడని.. రామును హత్య చేయాలని పథకం ప్రకారం హిమాంబి, నజీమా అనే మహిళలతో హనీట్రాప్ చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మహిళలు రాముకు ఫోన్ చేసి రమ్మనడంతో అతను యూసఫ్గూడలోని ఎల్ఎన్ నగర్కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన మణికంఠ, వినోద్, మహమ్మద్ ఖైసర్, శివకుమార్, నిఖిల్, తున్నా కుమార్, మరో ఐదుగురు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు ఇద్దరు మహిళలు సహకరించారని ఏసీపీ తెలిపారు.
తాజావార్తలు
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..