Pochampally Srinivas Reddy : రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా కాంగ్రెస్ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు, ఒకర్ని విమర్శించే వ్యక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ దాడి సరీకాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా కాంగ్రెస్ చేస్తుందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎలాంటి మత కల్లోలాలు,దాడులు,జరగకుండా పాలించారని, కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు,బాంబుల రాజకీయం తేవాలని చూస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రములో ముఖ్యమంత్రుల మార్చే కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ నయీమ్ లాంటి దేశ ద్రోహులను కట్టడి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరుకొక నయీమ్ తయారవుతాడు. కాంగ్రెస్ వస్తె భూఖబ్జాలు,గూడాయిజం పెరుగుతుంది. కేసీఆర్ ములుగు జిల్లాకి మెడికల్ కాలేజీ,ఎటూరునాగారం రెవెన్యూ డివిజన్,మల్లంపల్లి మండలం ఇచ్చారు. సీతక్క తనను ఓడించడానికి మంత్రులు వస్తున్నారని మాటలు చెపుతున్నారు. ఛత్తీస్ ఘడ్ నుండి సంచులు తెప్పించుకున్నది మీరు,సంచులతో కొనేది మీరు. 90 కోట్ల రూపాయలు ఒక ప్రయివేట్ హోట్లల్లో పెట్టి,నర్సంపేట,భూపాలపల్లి,పరకాల నియోజకవర్గాలకు పంచింది మీరు.
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
ఒక్క ఎంపీపీ కి 20 లక్షలు,సర్పంచ్ కి 10 లక్షలు,వార్డు మెంబర్ కి 1లక్ష రూపాయలు ఇచ్చి కొంటున్నది మీరు. న్యాయంగా ఓటు అడగాలే కానీ,సంచులతో కొనడం మీకు అలవాటు. 50 కోట్లు ములుగు జిల్లాకు తెప్పించుకుని,సంతలో సరుకులలాగా ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలను కొంటున్నది మీరు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెరిరింపులకు గురిచేయడం సీతక్కకు సరికాదు. కెమెరాలకు ఫొటోస్ కి పోజులు ఇచ్చింది మీరు..ప్రజా సేవా, అభివృద్ధి చేసింది మేము. సీతక్క తెరాస నాయకులకు నేను గెలుస్తా నని చెప్పి,ఎవరూ అధికారం లోకి వచ్చినా నేను అందులో వుంటా అని ఇతర పార్టీ కార్యకర్తలని మభ్య మభ్య పెడుతున్నారు. మనం చేసిన పనిని బట్టి ఓటు అడగడం మంచడాన్నారు. కేసీఆర్ వుంటేనే అభివృద్ది,శాంతి భద్రతలు ఉంటాయన్నారు.’ అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!