Rivaba Jadeja: “భారత ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఓదార్పు”.. కీలక వ్యాఖ్యలు చేసిన రవీంద్రా జడేజా భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా స్పందించారు.
అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం పాలైన ఆటగాళ్లను ఓదార్చడానికి మరియు మనోధైర్యాన్ని పెంచడానికి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రశంసించారు. గుజరాత్ జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. రివాబా జడేజా ఓ ట్వీట్లో.. ప్రధాని నరేంద్రమోడీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లడం అతని దయగల రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుందని అన్నారు. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
Read Also: Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
‘‘ ప్రధాని నరేంద్రమోడీ తిరుగులేని నాయకత్వం గెలుపు, ఓటమి క్షణాల్లో కూడా ప్రకాశిస్తుంది. ప్రపంచకప్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి ఆటగాళ్లను పరామర్శించడం ఆయన కరుణతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుంది, ప్రోత్సాహం, ఐక్యత స్ఫూర్తిని పెంచుతుంది’’ అంటూ మంగళవారం ఆమె ట్వీట్ చేశారు.
నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, లుబుషంగేలు ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అదించారు. భారత్ ఓటమి 140 కోట్ల ప్రజల్ని విషాదంలోకి నెట్టింది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!