Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Opens First Phase Of Delhi Mumbai Expressway In Rajasthans Dausa

PM Modi: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశను ప్రారంభించిన ప్రధాని

NTV Telugu Twitter
Published Date :February 12, 2023 , 5:47 pm
By Mahesh Jakki
PM Modi: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశను ప్రారంభించిన ప్రధాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Opens First Phase Of Delhi-Mumbai Expressway: రాజస్థాన్‌లోని దౌసాలో దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. 246 కిలోమీటర్ల ఢిల్లీ-దౌసా-లాల్సోట్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణ సమయం ఐదు గంటల నుంచి మూడున్నర గంటల వరకు తగ్గుతుంది. ఇది మొత్తం ప్రాంతంలో ఆర్థిక అవకాశాలను పెంచుతుందని కూడా భావిస్తున్నారు.

తూర్పు రాజస్థాన్‌లోని దౌసాలోని ధనవర్ గ్రామంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి మరిన్ని పెట్టుబడులను తెస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన రిమోట్‌ బటన్‌ను నొక్కి తొలిదశను ప్రారంభించారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనేది దేశం కోసం తమ మంత్రమని, దానిని అనుసరిస్తూనే ‘సమర్త్ భారత్’ చేస్తున్నామని ప్రధాన మంత్రి అన్నారు, ఎక్స్‌ప్రెస్ వే అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి అద్భుతమైన చిత్రమని అన్నారు. ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, ఓడరేవులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీలను తెరిచినప్పుడు వ్యాపారులు, చిన్న దుకాణదారులు, పరిశ్రమలకు బలం చేకూరుతుందని ప్రధాని మోదీ అన్నారు. పని కోసం ఢిల్లీకి వెళ్లే వారు ఇప్పుడు తమ పనిని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి రావచ్చని, ఎక్స్‌ప్రెస్‌వే చుట్టూ గ్రామీణ ‘హట్‌లు’ అభివృద్ధి చేయబడుతున్నాయి, ఇక్కడ స్థానిక కళాకారులు తమ వస్తువులను విక్రయించవచ్చు.

UK Drug Lord: మోస్ట్‌ వాంటెడ్‌, బ్రిటీష్‌ క్రైమ్‌ బాస్‌.. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌

ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల సరిస్కా నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, రణతంబోర్ నేషనల్ పార్క్‌తో పాటు జైపూర్, అజ్మీర్ వంటి నగరాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. రాజస్థాన్ ఇప్పటికే పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందిందని, కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుతో ఆకర్షణ మరింత పెరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వీడియో లింక్ ద్వారా కార్యక్రమంలో ప్రసంగించారు. జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసం నుంచి గెహ్లాట్ కార్యక్రమంలో పాల్గొనగా, ఖట్టర్ నుహ్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం నుంచి ప్రసంగించారు.

భారతదేశంలో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశ ఎన్నికలకు ముందు ప్రజల కోసం ప్రారంభం కావడం గమనార్హం. గ్రాండ్ ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రాజధాని నుంచి ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించి కేవలం 12 గంటల్లో వచ్చేలా చేస్తుంది. ఎనిమిది లేన్ల వెడల్పు, దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవుతో, ఇది ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించబడింది. ఇది 12 లేన్లకు అనుగుణంగా విస్తరించదగినది. గుజరాత్ నుండి మహారాష్ట్ర వరకు భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాలను అనుసంధానించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ అద్భుతంగా ఊహించబడింది.

Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….

ఎలక్ట్రిక్ వాహనం కోసం ఛార్జింగ్ స్టేషన్‌లు, హెలిప్యాడ్‌లు, ట్రామా సెంటర్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక లేన్‌ల వరకు దారి పక్కనే ఉన్న సౌకర్యాలతో, జంతువుల ఓవర్‌పాస్‌లు, వన్యప్రాణుల క్రాసింగ్‌లను కలిగి ఉన్న హైవేలలో ఆసియాలో ఇదే మొదటిది కావడం గమనార్హం. ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్రతి రెండు కిలోమీటర్లకు ఎస్వోఎస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. సోహ్నా-దౌసా స్ట్రెచ్‌ను ప్రారంభించడం వల్ల హర్యానాలోని గురుగ్రామ్, సోహ్నా, నూహ్, మేవాత్, రాజస్థాన్‌లోని అల్వార్, దౌసాలను మెగా ఎక్స్‌ప్రెస్‌వేకి కలుపుతుంది.ఢిల్లీ-దౌసా స్ట్రెచ్‌లో ఎనిమిది ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. అన్ని వాహనాలకు 120 కేఎంపీహెచ్‌ గరిష్ట వేగంతో, ఈ రహదారి ప్రతి సంవత్సరం దాదాపు 300 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని, 800 మిలియన్ కిలోగ్రాముల Co2 ఉద్గారాలను ఆదా చేస్తుంది. హైవే మొత్తం ఆటోమేటిక్ టోల్ బూత్‌లను కలిగి ఉంది. టోల్ ట్యాక్స్ ఒక్కసారి మాత్రమే తీసివేయబడుతుంది. ఒకరు హైవేలోకి ప్రవేశించిన క్షణం నుండి వారు నిష్క్రమించే వరకు ఇది లెక్కించబడుతుంది. 220 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-జైపూర్ ప్రయాణానికి టోల్ ట్యాక్స్ రూ. 70, ఇది కిలోమీటరుకు 35 పైసలుగా నిర్ణయించారు.

2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దిల్లీతోపాటు మధ్యలో అయిదు రాష్ట్రాలను (రాజస్థాన్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర) దాటుతూ ఈ రహదారి వెళుతోంది. జైపుర్‌, అజ్‌మేర్‌, కోటా, ఉదయ్‌పుర్‌, చిత్తోర్‌గఢ్‌, భోపాల్‌, ఇందౌర్‌, ఉజ్జయిని, అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదరా లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం అయిదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dausa
  • Delhi
  • Delhi-Mumbai Expressway
  • mumbai
  • PM Modi

తాజావార్తలు

  • Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..

  • Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

  • Ravindranath Reddy: సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైన అమలు చేశారా..? అన్ని కట్టు కథలే..!

  • Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..

  • Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions