Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Will Address Rally In Barasat On March 6 May Meet Sandeshkhali Womens

PM Modi: మోడీ కీలక నిర్ణయం.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో భేటీ!

Published Date :February 22, 2024 , 5:51 pm
By Suresh Maddala
PM Modi: మోడీ కీలక నిర్ణయం.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో భేటీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ బిజిబిజీగా గడుపుతున్న ప్రధాని.. తాజాగా సందేశ్‌ఖాలీ బాధితులను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమపై అత్యాచారం జరిగిందంటూ కొందరు మహిళలు బహిరంగంగా ఆరోపించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఆ బాధిత మహిళలను పరామర్శించాలని మోడీ డిసైడ్ అయ్యారు.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

ప్రధాని మోడీ మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను కలవనున్నట్లు తెలుస్తోంది. మార్చి 6న బరాసత్‌ (Barasat)లో బీజేపీ (BJP) మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో మోడీ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ తెలిపారు. ఒకవేళ సందేశ్‌ఖాలీలోని మాతృమూర్తులు, సోదరీమణులు ప్రధానిని కలవాలనుకుంటే అందుకు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. బీజేపీ నిరసనకారులను రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. మరోవైపు ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత మహిళలకు మద్దతుగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

అనంతరం బాధితులను కలిసేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘర్షణల్లో బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రివిలేజెస్‌ కమిటీ.. పశ్చిమబెంగాల్‌ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌, బీజేపీ ఎంపీ సుకాంత, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ హింసలో ప్రధాన నిందితుడుపరారీలో ఉన్న షాజహాన్‌ షేక్‌ను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం విస్మయం కలిగిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిని రక్షిస్తున్నారా లేదా అన్న విషయం తెలియదు కానీ, అతడిని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వానికి గుర్తుచేసింది.

తాజాగా ప్రధాని మోడీ బాధిత మహిళలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Address Rally
  • Barasat
  • March 6
  • PM Modi
  • Sandeshkhali Womens

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions