Modi foreign visit schedule: ఆగస్టు 29 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. ఏయే దేశాలకు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi foreign visit schedule: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29 – 30 తేదీలలో జరగనున్న 15వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లడం దీంతో కలిపి 8వ సారి, ఆ దేశ ప్రధానమంత్రి ఇషిబాతో ఇది మోడీకి మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది. దీని తర్వాత ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా పర్యటనలో ఉంటారు.
READ ALSO: Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్షా తీవ్ర ఆరోపణలు..
Also Read
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
వ్యూహాత్మక సమావేశం..
జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంపై సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంశాలు చర్చకురానున్నాయి. దీనితో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 ఏళ్ల తర్వాత చైనా పర్యాటనకు వెళ్తున్నారు. 2018 వ సంవత్సరం ప్రారంభంలో కింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధాని మోడీ చైనా వెళ్లారు. తర్వాత మళ్లీ ఆయన ఇప్పుడే ఆ దేశానికి వెళ్తున్నారు. ప్రస్తుతం భారతదేశం – చైనా రెండూ పరస్పరం సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి మోడీ ఆగస్టు 31 నుంసీ సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి టియాంజిన్ చేరుకుంటారు. ఈ సమయంలో ఆయన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అనేక మంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. షాంఘై సహకార సంస్థ టియాంజిన్ సమ్మిట్-2025 అనేది 25వ దేశాధినేతల మండలి సమావేశం. ఇది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 , వరకు చైనాలోని టియాంజిన్లో జరుగనుంది. చైనా వార్షిక షాంఘై సహకార సంస్థ సమ్మిట్ను నిర్వహించడం ఇది ఐదవసారి.
READ ALSO: Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్
తాజావార్తలు
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
-
Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
-
Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
-
Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!