Modi foreign visit schedule: ఆగస్టు 29 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. ఏయే దేశాలకు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi foreign visit schedule: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29 – 30 తేదీలలో జరగనున్న 15వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లడం దీంతో కలిపి 8వ సారి, ఆ దేశ ప్రధానమంత్రి ఇషిబాతో ఇది మోడీకి మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది. దీని తర్వాత ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా పర్యటనలో ఉంటారు.
READ ALSO: Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్షా తీవ్ర ఆరోపణలు..
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
వ్యూహాత్మక సమావేశం..
జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంపై సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంశాలు చర్చకురానున్నాయి. దీనితో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 ఏళ్ల తర్వాత చైనా పర్యాటనకు వెళ్తున్నారు. 2018 వ సంవత్సరం ప్రారంభంలో కింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధాని మోడీ చైనా వెళ్లారు. తర్వాత మళ్లీ ఆయన ఇప్పుడే ఆ దేశానికి వెళ్తున్నారు. ప్రస్తుతం భారతదేశం – చైనా రెండూ పరస్పరం సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతుండటం విశేషం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి మోడీ ఆగస్టు 31 నుంసీ సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి టియాంజిన్ చేరుకుంటారు. ఈ సమయంలో ఆయన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అనేక మంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. షాంఘై సహకార సంస్థ టియాంజిన్ సమ్మిట్-2025 అనేది 25వ దేశాధినేతల మండలి సమావేశం. ఇది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 , వరకు చైనాలోని టియాంజిన్లో జరుగనుంది. చైనా వార్షిక షాంఘై సహకార సంస్థ సమ్మిట్ను నిర్వహించడం ఇది ఐదవసారి.
READ ALSO: Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్
తాజావార్తలు
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..