Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake CBI Officers crime: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం కలకలం సృష్టించింది. నకిలీ సీబీఐ అధికారులుగా నటిస్తూ ఒక ముఠా ఏకంగా రూ.2.5 కోట్లు దోచుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్న ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.కోటికి పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: ACB: ఏసీబీకి వలలో వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
కోట్లు దోచుకెళ్లిన కేటుగాళ్లు..
ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఘజియాబాద్లోని ఇందిరాపురం సమీపంలో నివస్తున్న వ్యాపారస్థుడు మన్రైత్ను పలువురు నకిలీ సీబీఐ అధికారులు టార్గెట్ చేసి అతని కార్యాలయంలో నుంచి దాదాపు రూ.2.5 కోట్ల దోచుకెళ్లారు. ఆగస్టు 19న మన్రైత్ తన స్నేహితుడు రవిశంకర్ను తన ఆఫీస్ నుంచి రూ.1.10 కోట్లు తన ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. దీంతో రవిశంకర్ నగదు బ్యాగుతో బయటకు రాగానే, నలుగురు వ్యక్తులు రెండు కార్లలో వచ్చారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వచ్చిన వాళ్లు తమను తాము సీబీఐ అధికారులమని పరిచయం చేసుకొని రవిశంకర్పై దాడి చేసి, డబ్బు బ్యాగును లాక్కున్నారు. తర్వాత ఆయను బలవంతంగా ఆఫీసు లోపలికి తీసుకెళ్లి, అక్కడ ఉన్న మన్రోత్ ఉద్యోగి దీపక్ మహేశ్వరిని కొట్టారు. అనంతరం వారు ఆఫీసులో ఉంచిన మిగిలిన నగదును కూడా తమతో తీసుకెళ్లారు. ఈక్రమంలో ముఠా సభ్యులు వారిద్దరిని కూడా వారితో బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం చింతామణి అండర్పాస్ దగ్గర రవిశంకర్ను, నిగంబోధ్ ఘాట్ దగ్గర మహేశ్వరిని వదిలి వెళ్లారు.
విషయం తెలుసుకొని మన్రైత్ వివేక్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. డీసీపీ ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ.. సంఘటన స్థలం, చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, నిందితులు వాడిన వాహనాలు ఢిల్లీలోని సాకేత్లో ఉన్న ఒక ఎన్జీఓ పేరుతో అద్దెకు తీసుకున్నట్లు తేలిందన్నారు. ఈక్రమంలో ఫరీదాబాద్ నుంచి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశామన్నారు. వారిలో ఒకరు అస్సాంకు చెందిన పపోరి బారువా (31) అనే మహిళ కాగా, మరోకరు తుగ్లకాబాద్కు చెందిన దీపక్(32)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ మహిళ ఒక ఎన్జీఓకు కార్యదర్శిగా పని చేస్తుందని, నిందితుల నుంచి రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారిని కూడా గుర్తించామని, అతి త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు.
READ ALSO: Asim Iftikhar Ahmed: ముస్లింలు మాత్రమే ఉగ్రవాదులా?: పాక్ ప్రతినిధి ప్రశ్న..
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!