PM-KISAN: అన్నదాతలకు గుడ్న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN: అన్నదాతల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్ యోజనలో భాగంగా ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద 8 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.16,800 కోట్ల విలువైన 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడింది కానీ డిసెంబర్ 2018 నుంచే అమలులోకి వచ్చింది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని 13వ విడతను విడుదల చేస్తారని ఆదివారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో కూడిన లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా హాజరుకానున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 11వ, 12వ విడతలు మే, అక్టోబర్ 2022లో విడుదల చేయబడ్డాయి. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
Read Also: Elections: మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు.. ప్రారంభమైన పోలింగ్
పీఎం-కిసాన్ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించిందని, ఈ తాజా విడత వారి ఆదాయాన్ని మరింత పెంచుతుందని, వ్యవసాయ రంగ వృద్ధికి దోహదపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేయబడ్డాయి. ముఖ్యంగా, కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఈ నిరుపేద రైతులను ఆదుకోవడానికి రూ.1.75 లక్షల కోట్లు బహుళ వాయిదాలలో పంపిణీ చేయబడ్డాయి. సమిష్టిగా రూ.53,600 కోట్ల నిధులను పొందిన మూడు కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు కూడా ఈ పథకం ప్రయోజనం చేకూర్చింది. ఈ చొరవ గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. రైతులకు రుణ పరిమితులను తగ్గించింది. వ్యవసాయ పెట్టుబడులను పెంచింది. ఇది రైతుల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచింది. ఇది మరింత ఉత్పాదక పెట్టుబడులకు దారితీసింది.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!