PM-KISAN: అన్నదాతలకు గుడ్న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN: అన్నదాతల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్ యోజనలో భాగంగా ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద 8 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.16,800 కోట్ల విలువైన 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడింది కానీ డిసెంబర్ 2018 నుంచే అమలులోకి వచ్చింది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని 13వ విడతను విడుదల చేస్తారని ఆదివారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో కూడిన లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా హాజరుకానున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 11వ, 12వ విడతలు మే, అక్టోబర్ 2022లో విడుదల చేయబడ్డాయి. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
Read Also: Elections: మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు.. ప్రారంభమైన పోలింగ్
పీఎం-కిసాన్ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించిందని, ఈ తాజా విడత వారి ఆదాయాన్ని మరింత పెంచుతుందని, వ్యవసాయ రంగ వృద్ధికి దోహదపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేయబడ్డాయి. ముఖ్యంగా, కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఈ నిరుపేద రైతులను ఆదుకోవడానికి రూ.1.75 లక్షల కోట్లు బహుళ వాయిదాలలో పంపిణీ చేయబడ్డాయి. సమిష్టిగా రూ.53,600 కోట్ల నిధులను పొందిన మూడు కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు కూడా ఈ పథకం ప్రయోజనం చేకూర్చింది. ఈ చొరవ గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. రైతులకు రుణ పరిమితులను తగ్గించింది. వ్యవసాయ పెట్టుబడులను పెంచింది. ఇది రైతుల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచింది. ఇది మరింత ఉత్పాదక పెట్టుబడులకు దారితీసింది.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?