Amit Shah: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం ‘సెంగోల్’
Amit Shah: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టికి ఉదాహరణ అని అమిత్ షా అన్నారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. రావడం లేదా రాకపోవడం వారికి విజ్ఞత మీద ఆదారపడి ఉంటుందని పేర్కొన్నారు. భవనం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయకూడని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
భవన నిర్మాణంలో భాగమైన 7,000 మందిని కార్మికులను ప్రధాని మోదీ సత్కరిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం ‘సెంగోల్’ను ప్రధాని ఉంచుతారన్నారు. దీనిని ప్రధాని మోదీ తమిళ ఆదివాసీల నుంచి మే 28న స్వీకరిస్తారని తెలిపారు. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ సెంగోల్ను స్వీకరించారని అమిత్ షా చెప్పారు.భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో సెంగోల్కు చాలా ప్రాముఖ్యత ఉందని కేంద్ర హోంమంత్రి అన్నారు. చోళ రాజవంశం కాలం నుండి సెంగోల్ ముఖ్యమైనది. ఇది కొత్త పార్లమెంటులో ఉంచబడుతుందని ఆయన అన్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
Read Also: Karnataka: మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. సీఎం నివాసం ఎదుట ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన (యూబీటి), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని విపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం మధ్య, మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకటన చేయడానికి అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంట్ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రణాళికలను ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. జాతిపిత మహాత్మా గాంధీ నుంచి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలను పంచుకున్న హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి సందర్భంగా ఈవెంట్ను షెడ్యూల్ చేయడాన్ని కూడా వారిలో కొందరు విమర్శించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!