PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలం పర్యటనకు ప్రధాని మోడీ.. ఆ రూట్లో ఆంక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. శ్రీశైల జ్యోతిర్లింగం, భ్రమరాంబికా శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఐదవ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలవనున్నారు.. గతంలో ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.. ఈ నేపథ్యంలో ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. కాశీ, ఉజ్జయిని తరహాలో శ్రీశైల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారు.. శ్రీశైల దేవస్థాన అభివృద్ధికి 5400 ఎకరాల భూమిని అటవీశాఖ అభ్యంతరాలు లేకుండా కేటాయించాలని నివేదిక ద్వారా కోరనున్నారు.
READ MORE: Naveen Reddy : మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డికి 6 నెలల నగర బహిష్కరణ
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్కు చుక్కలే..!
- FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
- IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ - ఇంగ్లాండ్ మూడో టీ20..
- DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్..
ఉదయం 07.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఐఏఎఫ్ ఎంబ్రార్ విమానంలో బయలుదేరుతారు. 10:20 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:25 గంటలకు ఎంఐ-17 హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 11:15 గంటలకు సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం లోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్ది సేపు విరామం తీసుకుంటారు. 11:45 గంటలకు శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని… భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 1:35 గంటలకు సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరతారు. 2:20 గంటలకు కర్నూలు నగర శివారులో రాగమయూరి గ్రీన్ హిల్స్ లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 2:30 నుంచి 4:05 గంటల వరకు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు. 4:20 గంటలకు హెలికాప్టర్ కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 4:45 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు..
తాజావార్తలు
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్కు చుక్కలే..!
-
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
-
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
-
Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకే లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్పై క్లారిటీ!
ట్రెండింగ్
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!