PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ ప్రాంతాలను సందర్శించారు. లక్షద్వీప్లోని అద్భుతమైన అనుభవాలను చెప్పడంతో పాటు, అక్కడి ప్రజలకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లోని బీచ్లో గడిపారు. వారు బీచ్లో ప్రశాంతత, ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ప్రధాని మోడీ ఎప్పుడూ సాహసానికి సిద్ధంగా ఉంటారు. లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ఆయన సముద్రంలో స్నానం చేసి లోతైన నీటిలో స్నార్కెలింగ్ చేశారు. ప్రధాని మోడీ ఎప్పుడూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన లక్షద్వీప్ పర్యటనలో కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నారు. సముద్ర తీరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై సందేశం ఇచ్చారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న లక్షద్వీప్ అందాలను కూడా ప్రధాని చూపించారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ అడవి చిత్రాలను ఆయన పంచుకున్నారు. లక్షద్వీప్ వైపు పర్యాటకులను ఆకర్షించడానికి ఈ చిత్రాలు సరిపోతాయి.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024
స్నార్కెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్కెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడుతారు. ఈ స్నార్కెలింగ్తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని, జీవరాశులను అన్వేషించొచ్చు. అలాంటి సాహసం చేశారు ప్రధాని మోడీ.
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024