Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!
- పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- పంబన్ బ్రిడ్జ్ను జాతికి అంకితమిచ్చిన ప్రధాని
- రామేశ్వరం-తాంబరం కొత్త రైలును ప్రారంభించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!
Also Read
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో పంబన్ బ్రిడ్జ్ను నిర్మించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నాలుగు ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్ను తీర్చిదిద్దారు. బ్రిడ్జ్ దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ద్వీపాన్ని భారత ఖండంతో అనుసంధానం చేస్తుంది. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం భారతదేశ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 2024 నవంబర్ నాటికి పూర్తయింది. 1914లో బ్రిటిష్ ఇంజనీర్లు నిర్మించిన పాత పాంబన్ బ్రిడ్జ్ 105 సంవత్సరాల పాటు సేవలందించింది. అయితే సముద్ర వాతావరణం వల్ల క్షీణించడం, తుప్పు పట్టడం వల్ల డిసెంబర్ 2022లో ఈ వంతెన ఉపయోగం ఆగిపోయింది.
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge – India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!