PM Modi in France: ‘ఫ్రాన్స్తో నాకు 40ఏళ్ల బంధముంది’.. ప్యారిస్లో భారతీయులతో ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in France: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్లో ఉన్నారు. పారిస్లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఫ్రాన్స్కు తనకు మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి బంధం ఉందన్నారు. ఈ సమయంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో అలయన్స్ ఫ్రాంకైస్ సభ్యత్వం తీసుకున్నప్పుడు ప్రధాని 40 ఏళ్ల సభ్యత్వ కార్డును ప్రస్తావించారు. ఫ్రాన్స్తో అనుబంధం చాలా కాలంగా ఉందని, ఎప్పటికీ దానిని మర్చిపోలేనని ప్రధాని మోడీ అన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అహ్మదాబాద్లో ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ప్రారంభమైంది. ఆ కేంద్రంలో మోడీ తానే మొదటి సభ్యుడని, అదే సభ్యుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను అన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆ సభ్యత్వ కార్డు జీరాక్స్ ఇచ్చిందని, నేటికీ అది తనకు వెలకట్టలేనిదని అన్నారు.
Read Also:Tejaswi Madivada : మతిపోగొట్టే అందాలతో మత్తెక్కిస్తున్న తేజస్వి..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
అలయన్స్ ఫ్రాంకైస్ అనేది విదేశాలలో ఫ్రెంచ్ భాష, సంస్కృతిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పురాతన సంస్థ. ఇది ఫ్రాన్స్ అవగాహన, ప్రశంసలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది 1860లో అహ్మదాబాద్లో స్థాపించబడింది. దేశానికి దూరంగా ఉన్నప్పుడు ‘భారత్ మాతా కీ జై’ నినాదం వింటే, ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. భారతీయులమైన మనం ఎక్కడికి వెళ్లినా, ఖచ్చితంగా మినీ ఇండియాను తయారు చేస్తాం. భారతదేశ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశం చేస్తున్న కృషి పరిధి చాలా పెద్దది. భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’, భారతదేశం ‘వైవిధ్యం నమూనా’ కూడా. ఇదే మన గొప్ప శక్తి, బలం అని అన్నారు. 10 ఏళ్లలో ప్రపంచంలో 10 నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also:Vijay Devarakonda: విజయ్ తో రాశీ.. బేబీ ప్రీమియర్ షో లో హల్చల్
చంద్రయాన్-3 ప్రయోగం
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి భారతదేశంలో రివర్స్ కౌంటింగ్ జరుగుతుందని ప్రధాని అన్నారు. కొన్ని గంటల తర్వాత, ఈ చారిత్రాత్మక ప్రయోగం భారతదేశంలోని శ్రీహరికోట నుండి జరగబోతోంది. తాను ఓ తీర్మానంతో బయటకు వచ్చానని ప్రధాని మోడీ చెప్పారు. శరీరంలోని ప్రతి కణం, సమయంలోని ప్రతి క్షణం ప్రజల కోసం, దేశవాసుల కోసం మాత్రమే.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!