PM Modi: ఆ సర్వేలో ప్రధానికి అత్యధిక రేటింగ్.. ఏ విషయంలోనంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది. ఆయనను అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా అభివర్ణించగా.. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మార్నింగ్ కన్సల్ట్ ఎన్నికైన నాయకులకు వారానికోసారి ఆమోదం రేటింగ్లను అందిస్తుంది. ఈ సర్వేలో ప్రధాని మోడీ నిలకడగా అగ్రస్థానంలో ఉన్నారు. అతని ఆమోదం రేటింగ్ ఎక్కువగా 70 కంటే ఎక్కువ.
Rohit Sharma: రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
Also Read
- ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ‘X’, (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వే.. ప్రపంచ నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణ అసమానంగా ఉందని ఆయన రాశారు. విదేశాంగ విధానంలో ప్రధాని సూత్రం విజయవంతమవడమే కాకుండా.. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడంలో ప్రధాని మోడీ సాధించిన విజయాలు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన నిస్వార్థ కృషి, ఆయనపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. అని అమిత్ షా తెలిపారు.
The latest Morning Consult survey shows that PM @narendramodi Ji's popularity remains unrivalled among global leaders.
This is not only a testament to the success of the Modi doctrine in foreign policy but also a global recognition of Modi Ji's undeterred achievements in lifting… pic.twitter.com/yuuYz5zYIi
— Amit Shah (@AmitShah) September 15, 2023
Health Tips: ఆహారం విషయంలో ఈ పొరపాట్లు చేస్తే.. ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..!
మరోవైపు జీ-20 సమ్మిట్ 2023కి భారతదేశం అధ్యక్షుడిగా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత అత్యధిక గ్లోబల్ అప్రూవల్ రేటింగ్తో పీఎం మోడీ అగ్రగామిగా నిలిచారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత ప్రధాని మోడీ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయిలో విశ్వాసం, నాయకత్వానికి అసమానమైన చిహ్నంగా ప్రధాని మోడీ నిలిచారన్నారు. అట్టడుగున ఉన్నవారికి సాధికారత కల్పించడానికి అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడానికి అతని అసాధారణ అంకితభావంలో అతను చెప్పలేని స్ఫూర్తి అని అన్నారు.
తాజావార్తలు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!