PM-KISAN Funds: పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.
- రైతులందరి ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2000 బదిలీ.
- రైతులకు 3 సమాన వాయిదాల్లో ఏటా రూ.6000 బదిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN Funds Release: దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా ఇచ్చే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 9.4 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశారు. ఈ రైతులందరి ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2000 బదిలీ చేశారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.3.45 లక్షల కోట్లు పంపిణి చేసింది.
PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. రైతులకు 3 సమాన వాయిదాల్లో ఏటా రూ.6,000 బదిలీ చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఈ సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరుతుంది. మహారాష్ట్రలో ఈ పథకంలో 17 విడతలుగా సుమారు 1.20 కోట్ల మంది రైతులకు సుమారు రూ.32,000 కోట్లు అందించారు. సమ్మాన్ నిధి 18వ విడతలో రాష్ట్రంలోని దాదాపు 91.51 లక్షల మంది రైతులకు రూ.1,900 కోట్లకు పైగా లబ్ధి చేకూరనుంది. ఇది కాకుండా, నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన 5వ విడత కింద మహారాష్ట్ర రైతులకు ప్రధాని మోదీ సుమారు రూ. 2,000 కోట్ల అదనపు ప్రయోజనాన్ని అందించారు.
Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా 2.5 కోట్ల మంది రైతులు వెబ్కాస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!