PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటన.
- పలు ప్రారంభోత్సవం & శంకుస్థాపన కార్యక్రమాలు.
- బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్రావ్ మహారాజ్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
Reliance Jio: బంపర్ ఆఫర్.. రూ.175లకే 12 ఓటీటీలు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
దీని తరువాత, ప్రధాని మోడీ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించాడు. బంజారా కమ్యూనిటీ వారసత్వ వేడుకలో కూడా పాల్గొన్నారు. వాషిమ్ తర్వాత, ప్రధాని మోదీ థానే, ముంబైలను కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో 32,800 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహీన్ యోజన లబ్ధిదారులను కూడా ఆయన సత్కరిస్తారు. దీని తరువాత, మోడీ BKC మెట్రో స్టేషన్ నుండి JVLR, ముంబై మధ్య నడిచే మెట్రో రైలును సాయంత్రం 6 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా BKC – శాంటాక్రూజ్ స్టేషన్ మధ్య మెట్రోలో ప్రయాణిస్తారు.
Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన
ఇక ప్రధానమంత్రి 9.4 కోట్ల మంది రైతులకు సుమారు రూ. 20,000 కోట్లతో ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను విడుదల చేస్తారు. దీంతో సమ్మాన్ నిధి కింద రైతులకు విడుదల చేసిన మొత్తం రూ.3.45 లక్షల కోట్లు అవుతుంది. ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ 5వ విడతను కూడా ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. దీని కింద దాదాపు రూ.2,000 కోట్లు విడుదల చేయనున్నారు.
#WATCH | Washim, Maharashtra: Prime Minister Narendra Modi tries his hands on a traditional dhol at the Samadhi of Sant Seva Lal Ji Maharaj. pic.twitter.com/NGhk2sBNUo
— ANI (@ANI) October 5, 2024
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!