AP: “పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఫోటోలు, రాజకీయ పార్టీ జెండాలు ఉండొద్దు”
- గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచన
- పార్టీ రంగులు..జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు..పాస్ పుస్తకాలు..ధ్రువీకరణ పత్రాలను నిలిపేయాలి ప్రభుత్వ ఆదేశం
- ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..పథకాల అమలు, పేర్లు కొనసాగింపునకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది. గత సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను మార్చింది. 2019 ఏడాదికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019 – 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని సూచించింది. మంత్రి డొలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లని మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
READ MORE: Viral Video: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్.. నానా పటోలే ఏం చేశారంటే..!
Also Read
- Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-24 మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపింది. గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని ఆదేశించింది. కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకూ సదరు పథకాల జనరల్ పేర్లను కొనసాగించాలని స్పష్టం చేసింది. పార్టీ రంగులు, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!