PFI: ఐదేళ్ల నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన పీఎఫ్ఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI: కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పీఎఫ్ఐ తన పిటిషన్లో ఉపా(UAPA) ట్రిబ్యునల్ మార్చి 21 నాటి నిర్ణయాన్ని సవాలు చేసింది. దీనిలో సెప్టెంబర్ 27, 2022 నాటి కేంద్రం నిర్ణయాన్ని ధృవీకరించింది.
Also Read: Kerala: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిషేధిత పీఎఫ్ఐ వ్యక్తి అరెస్ట్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పీఎఫ్ఐ పిటిషన్ను విచారించాల్సి ఉండగా.. పిటిషనర్ వాయిదాకు లేఖ ఇచ్చారని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు, దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినందుకు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐని ఐదేళ్ల పాటు నిషేధించింది. కేంద్రం పీఎఫ్ఐ, దాని సహచరులు లేదా ఫ్రంట్లను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో ఏడు రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో పీఎఫ్ఐకి సంబంధించిన 150 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 16 ఏళ్ల ఈ సంస్థపై భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి.
Also Read: Karnataka Poster War: అవినీతిపై కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీజేపీ పోస్టర్ వార్
పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నాయకులుగా ఉన్నారని, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) నోటిఫికేషన్ పేర్కొంది. JMB, SIMI రెండూ నిషేధిత సంస్థలు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) వంటి గ్లోబల్ టెర్రరిస్టు గ్రూపులతో పీఎఫ్ఐ అంతర్జాతీయ సంబంధాలకు అనేక ఉదాహరణలున్నాయని పేర్కొంది. దేశంలో అభద్రతా భావాన్ని పెంపొందించడం ద్వారా సమాజంలో తీవ్రవాదాన్ని పెంచేందుకు పీఎఫ్ఐ రహస్యంగా పనిచేస్తోందని, కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో చేరడమే ఇందుకు నిదర్శనమని నోటిఫికేషన్ పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!