Petrol Crisis: ఆర్థిక సంక్షోభంతో.. అక్కడ పెట్రోల్ బంకులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభానికి తాజా అడ్రస్గా మారింది పాకిస్తాన్.. ఆర్థిక సంక్షోభం అంటే.. ఒక దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దేశ ప్రజలకు అవసరమైన నిత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులకు చేరుకోవడం.. దాంతో మనం తినే, వినియోగించే అత్యవసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చుంటాయి. పాకిస్తాన్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. రోజులు గడిచేకొద్ది పాకిస్తాన్ అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతోంది. అయితే, తాజాగా పెట్రోల్ బంకులను రెండు రోజుల పాటు ( జులై 22 నుంచి జులై 24 వరకు ) బంద్ చేస్తున్నట్లు పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం తెలిపింది.
Read Also: Samantha Break: ఏడాది రెస్ట్.. సమంతకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
Also Read
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోవడంతో పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకు దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాక్ లో లీటరు పెట్రోల్ 253 రూపాయలు.. కాగా డీజిల్ ధర 253.50 పైసలుగా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ పట్టుబట్టింది.
Read Also: Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..
అయితే, గత కొంతకాలంగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్.. పాక్ సర్కార్ కు పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ సర్కార్ కేవలం 2.4శాతం మాత్రమే మార్జిన్ ఇస్తుందని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఇవాళ్టి నుంచి సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) సాయంత్రం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ సంఘం ప్రకటించింది. ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసును నిలిపివేస్తున్నట్లు పెట్రోలియం అసోషియేషన్ సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్ తెలిపారు.
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!