Petrol Diesel Rates in Pakistan: భారీ షాక్.. లీటరు పెట్రోల్ పై రూ. 26, డీజిల్ రూ.17 పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Rates in Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిరోజూ వస్తువుల ధరలను పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఇంధన ధరలను భారీగా పెంచింది. పాకిస్థాన్లో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.26, 2 పైసలు పెంచింది. కాగా డీజిల్పై రూ.17 34 పైసలు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల అక్కడి ప్రజలు మరింత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం ఒత్తిడిని పెంచడం గమనార్హం.
Read Also:Nipah Virus: నిఫా వైరస్ కోవిడ్ కన్నా డేంజర్.. ఐసీఎంఆర్ హెచ్చరిక
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
ఇప్పుడు కొత్త ధర ఎంత?
గత వారం పెట్రోలియం డీలర్లు, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లను పెంచడానికి ఆర్థిక సమన్వయ కమిటీ (ఇసిసి) ఆమోదం తెలిపింది. పెట్రోల్, డీజిల్ విక్రయాల మార్జిన్ను లీటరుకు రూ.3.5 పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పెంచిన ఇంధన ధరల కారణంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.331 38 పైసలు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.329 18 పైసలుగా మారింది.
Read Also:Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య మృతి..
ప్రభుత్వం వాదన
ఓఎంసీలు, డీలర్ల కోసం పెట్రోల్, డీజిల్ అమ్మకాల మార్జిన్లను పెంచడానికి ఈసీసీ ఆమోదించింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, గ్లోబల్ కమోడిటీ ధరలు పెరుగుతూనే ఉన్నందున పెట్రోలియం ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. పాకిస్థాన్ కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చిన్నచిన్న వస్తువులను సైతం ఖరీదైన ధరలకు విక్రయిస్తున్నారు. ఈఎంఎఫ్, బెయిలౌట్ ఫండ్ నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ ద్రవ్యోల్బణంలో గణనీయమైన తేడా ఏమీ లేదు.
తాజావార్తలు
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..