Perni Nani: రాజుల సొమ్ము రాళ్ల పాలు అనే చందంగా ఉంది చంద్రబాబు పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం ఏంటి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టడమే మా బాధ్యత.. ఏ ఆధారాలు లేకుండానే సీఐడీ, ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా అని ఆయన అడిగారు.
Read Also: Kajal Aggarwal: ‘భగవంత్ కేసరి’లో నా పాత్ర అదే.. అసలు విషయం చెప్పేసిన కాజల్
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
తన అపారమైన మేధస్సును చంద్రబాబు ఉపయోగించి సుమారుగా 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అని పేర్నినాని ఆరోపించారు. ప్లిడర్లు అందరూ చంద్ర బాబు పాపపు సొమ్ముతో పండుగ చేసుకుంటున్నారు.. సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అయినా ఏన్నాళ్ళు వుంచుతుంది జైలులో.. ఇప్పటికీ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కిల్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందని కేసులు నమోదు చేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జీఎస్టీ డిపార్ట్మెంట్ లు అవినీతి జరిగినట్లు కేసులు నమోదు చేశాయని ఆయన తెలిపారు. వాటన్నిటినీ ప్రామాణికంగా చేసుకొని విచారణ చేసి కేసు నమోదు చేసింది సీఐడీ డిపార్ట్మెంట్ అని పేర్నినాని వెల్లడించారు.
Read Also: Merugu Nagarjuna: దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు టీడీపీ సిద్ధమా..?
ఒక్కసారి కోర్టు తీర్పు ఇస్తే ఇక, ఆ అంశం కోర్టుకు సంబంధించింది.. కోర్టు పరిధిలోని అంశాలను మేము ఎలా మాట్లాడతాం అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. అయినా ఎంతో మేధస్సు కలిగిన న్యాయవాదులను పెట్టీ కేసును చంద్రబాబు వాదించుకుంటున్నారు.. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారయ్యింది.. కనీసం ఒక్క కంప్యూటర్ కూడా బిగించకుండా డబ్బులు ఇప్పించి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి కిలారు రాజేష్ కి, పీఏ శ్రీనివాస్ కి ఇచినట్లు ఇన్కమ్ టాక్స్ తెలిపింది అని ఆయన ఆరోపించారు.
Read Also: Driverless Cars: ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్ లేని కార్లు..
చంద్రబాబుపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించింది అని టీడీపీ నేతలు బొంకుతున్నారు అని పేర్నినాని మండిపడ్డారు. కాలం నడిచినప్పుడు నడిచింది ఎన్ని డ్రామాలు ఆడిన ఏమీ అణిచి వేశారు అని పేర్నినాని అన్నారు. మిమల్ని తాళ్లతో, రిబ్బన్లతో కట్టుకొన్నపుడు ఏమీ ఆపారు మిమల్ని, అర్థ నగ్న ప్రదర్శన చేసినప్పుడు అపారా, పవన్ కళ్యాణ్ వెళ్లి పొత్తు ప్రకటించినప్పుడు ఆపారా.. ఈ ప్రభుత్వం మిమల్ని ఏ విషయంలో గొంతు నొక్కుతున్నారు అనేది చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?