Perni Nani Political Retirement: సీఎంకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. ఇక, రిటైర్ అయిపోతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani Political Retirement: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పేర్నినాని.. సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.. వయస్సులో చిన్నవాడు అయిపోయాడు.. లేదంటే సీఎం వైఎస్ జగన్కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు.. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానన్న పేర్నినాని.. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి .. ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని తెలిపారు. అయితే, సీఎం వైఎస్ జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో..? లేదో? తెలియదు అని వ్యాఖ్యానించారు పేర్నినాని.
ఇక, పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డాడు అంటూ మండిపడ్డారు పేర్ని నాని.. ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంఖుస్థాపన చేశాడని విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 450 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.. ఈ ఒక్క నియోజకవర్గంలో 25,090 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపరాఉ.. ఒక్క లే అవుట్ లోనే 15 వేల మందికి పట్టాలు ఇస్తామని తెలిపారు.
Also Read
- Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
- Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
- Morne Morkel: "సీనియర్లకు అండగా నిలుస్తాం".. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
బందరు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి పోటీగా మరో ఊరు ఏర్పడనుందన్నారు పేర్నినాని.. చంద్రబాబు హయాంలో కలెక్టరేట్ గబ్బిలాలతో ఉండేదని.. పాలన అంతా విజయవాడలోనే ఉండేదని.. జిల్లా విభజన చేసి బందర్ను హెడ్ క్వార్టర్ చేశారని సీఎంపై ప్రశంసలు కురిపించారు. బందరుకు కళ వచ్చింది.. మెడికల్ కాలేజీ ప్రారంభం అవుతోందన్నారు. అయితే, మెడికల్ కాలేజీ దగ్గర ఆర్వోబీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేయాలని కోరుతున్నాను.. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు పట్టా భూములు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ అంటూ సభా వేదిక నుంచి సీఎం వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే, పేర్ని నాని, పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. నాని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్చేయండి..
తాజావార్తలు
-
Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
-
Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
-
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
-
Nani Directors : ప్యారడైజ్ లేట్.. బిజీగా నాని డైరెక్టర్స్
-
116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..