Perni Nani Political Retirement: సీఎంకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. ఇక, రిటైర్ అయిపోతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani Political Retirement: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పేర్నినాని.. సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.. వయస్సులో చిన్నవాడు అయిపోయాడు.. లేదంటే సీఎం వైఎస్ జగన్కు పాదాభివందనం చేసి ఉండేవాడిని అని వ్యాఖ్యానించారు.. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానన్న పేర్నినాని.. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి .. ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని తెలిపారు. అయితే, సీఎం వైఎస్ జగన్ తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో..? లేదో? తెలియదు అని వ్యాఖ్యానించారు పేర్నినాని.
ఇక, పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు అడ్డుపడ్డాడు అంటూ మండిపడ్డారు పేర్ని నాని.. ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని తెలిపారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంఖుస్థాపన చేశాడని విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 450 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.. ఈ ఒక్క నియోజకవర్గంలో 25,090 మందికి పట్టాలు ఇచ్చామని తెలిపరాఉ.. ఒక్క లే అవుట్ లోనే 15 వేల మందికి పట్టాలు ఇస్తామని తెలిపారు.
Also Read
- Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
బందరు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి పోటీగా మరో ఊరు ఏర్పడనుందన్నారు పేర్నినాని.. చంద్రబాబు హయాంలో కలెక్టరేట్ గబ్బిలాలతో ఉండేదని.. పాలన అంతా విజయవాడలోనే ఉండేదని.. జిల్లా విభజన చేసి బందర్ను హెడ్ క్వార్టర్ చేశారని సీఎంపై ప్రశంసలు కురిపించారు. బందరుకు కళ వచ్చింది.. మెడికల్ కాలేజీ ప్రారంభం అవుతోందన్నారు. అయితే, మెడికల్ కాలేజీ దగ్గర ఆర్వోబీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేయాలని కోరుతున్నాను.. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు పట్టా భూములు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ అంటూ సభా వేదిక నుంచి సీఎం వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే, పేర్ని నాని, పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. నాని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్చేయండి..
తాజావార్తలు
-
Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్పై ఎంత పెరిగిందంటే?
-
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ట్రెండింగ్
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..