CM Chandrababu: తిరుమల-తిరుపతి, చంద్రగిరి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం.. శంకుస్థాపన చేసిన సీఎం..
- చంద్రగిరి, తిరుమల-తిరుపతి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం..
- రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు కృష్ణా జలాలు..
- నీళ్లు మళ్లింపు పనులకు మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల – తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.. రూ.126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్ల మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
Also Read
ఇక, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లెలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా.. సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డీఐఎంసీ, ఇండోర్ సబ్స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా రంగంపేట, బీమావరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వరాలయానికి వెళ్లే బీటీ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అయితే, తిరుమల–తిరుపతి ప్రాంతం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే ప్రాంతమని, ఇక్కడ తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపడతామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!