Ponguleti Srinivas reddy : తెలంగాణలో రేషన్కార్డు మీకు ఉందా.. అయితే ఇది మీకోసమే..
- ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన - అభివృద్ధి బాటలో రామచంద్రాపురం
- తెలంగాణ అభివృద్ధిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
- సీతారామ ప్రాజెక్టు వేగంగా కొనసాగిస్తోన్న ప్రభుత్వం
Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రం అప్పుల బాదుడులో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే 57,626 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే తొలిసారి సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ అందించిన ప్రభుత్వం తమదేనని తెలిపారు.
యువత కోసం ఉపాధి కార్యక్రమాలు: నిరుద్యోగుల ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాస్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని, వాటిని సరిచేస్తూ అప్పులను తీర్చుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అలాగే, మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. రామచంద్రాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఇళ్ల మంజూరుకు సంబంధించి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఫారెస్ట్ , ప్రైవేట్ భూముల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాజీ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై అలసత్వం వహించిందని విమర్శించిన పొంగులేటి, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చెరువులు నిండుగా ఉండేలా నీటి సరఫరా నిరంతరంగా ఉంటుందని, రైతులకు సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించి, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని మంత్రి పొంగులేటి ప్రజలను కోరారు.
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు.. వాళ్లే టార్గెట్
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!