Ponguleti Srinivas reddy : తెలంగాణలో రేషన్కార్డు మీకు ఉందా.. అయితే ఇది మీకోసమే..
- ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన - అభివృద్ధి బాటలో రామచంద్రాపురం
- తెలంగాణ అభివృద్ధిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
- సీతారామ ప్రాజెక్టు వేగంగా కొనసాగిస్తోన్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్రం అప్పుల బాదుడులో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే 57,626 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే తొలిసారి సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ అందించిన ప్రభుత్వం తమదేనని తెలిపారు.
యువత కోసం ఉపాధి కార్యక్రమాలు: నిరుద్యోగుల ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాస్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని, వాటిని సరిచేస్తూ అప్పులను తీర్చుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అలాగే, మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. రామచంద్రాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఇళ్ల మంజూరుకు సంబంధించి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఫారెస్ట్ , ప్రైవేట్ భూముల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాజీ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై అలసత్వం వహించిందని విమర్శించిన పొంగులేటి, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చెరువులు నిండుగా ఉండేలా నీటి సరఫరా నిరంతరంగా ఉంటుందని, రైతులకు సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించి, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని మంత్రి పొంగులేటి ప్రజలను కోరారు.
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు.. వాళ్లే టార్గెట్
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!