Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..
- అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్
- పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు
- పెన్నా సిమెంట్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ లలో సిమెంట్ యూనిట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. దింతో ఇకనుంచి అంబుజా సిమెంట్స్ కు 14 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దింతో.. అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇది రెండవ అతిపెద్ద దేశీయ సిమెంట్ కంపెనీగా అవతరించనుంది.
Kannappa : భక్త కన్నప్ప కథ ఏంటి? వదిలిన టీజర్ ఏంటి? ఏమన్నా సింక్ ఉందా?
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. పెన్నా సిమెంట్ కు శ్రీలంకలో అనుబంధ కంపెనీ ఉండడమే ఇందుకు కారణం. పెన్నా సిమెంట్ కు చెందిన సున్నపురాయి గనులు అంబుజా సిమెంట్స్ కు కూడా ఉన్నాయి. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్లో 100% వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ ప్రమోటర్ పి ప్రతాప్ రెడ్డి, అతని కుటుంబంతో అంగీకరించినట్లు అంబుజా సిమెంట్స్ గురువారం ప్రకటించింది.
Drinks For Thyroid Problems: థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆరు పానియాలు ట్రై చేయండి
తమ నిధులతో పెన్నా సిమెంట్ను కొనుగోలు చేస్తున్నామని అంబుజా సిమెంట్స్ సీఈవో అజయ్ కపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అంబుజా సిమెంట్స్ అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తమ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ కొనుగోళ్లు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో రూ.1,241 కోట్ల టర్నోవర్ ను నమోదు చేసింది. పెన్నా సిమెంట్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లలో సిమెంట్ యూనిట్లు ఉన్నాయి. పెన్నా సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 14 మిలియన్ టన్నుల సిమెంట్. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్)లో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల యూనిట్, జోధ్పూర్ (రాజస్థాన్)లో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ యూనిట్లు వచ్చే సంవత్సరంలోగా ఉత్పత్తి చేయనున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!