Pemmasani Chandrashekar: మంగళగిరి నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలో డ్రైనేజీలను నిర్మిస్తామని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రోడ్లు వేయిస్తామని, 20 వేల పక్కా ఇళ్లు నిర్మిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ పక్కా ఇళ్ల నిర్మాణం హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం
Also Read
అనంతరం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. రైతుల గురించి ప్రభుత్వాలు తగ్గిపోతున్నాయని, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామగ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?