Pemmasani Chandrashekar: మంగళగిరి నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం
Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలో డ్రైనేజీలను నిర్మిస్తామని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రోడ్లు వేయిస్తామని, 20 వేల పక్కా ఇళ్లు నిర్మిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ పక్కా ఇళ్ల నిర్మాణం హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం
Also Read
అనంతరం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. రైతుల గురించి ప్రభుత్వాలు తగ్గిపోతున్నాయని, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామగ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!