Pemmasani: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా.. ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు హయంలో రాజధాని ప్రాంతంలో మూడు అద్భుతమైన యూనివర్సిటీలను తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది అని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Read Also: Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టింది..
Also Read
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
చంద్రబాబు, లోకేష్, నేను ఉన్నంత వరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని నేను.. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను.. అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగు పెట్టానన్నారు. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్లలో నా వల్ల ఈ ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇస్తున్నానని పెమ్మసాని పేర్కొన్నారు.
Read Also: Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!
ఇక, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడితో పాటు అంతకు ముందు ఉన్న సీఎంలు తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసమే అన్నారు. బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టీడీపీ హయంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటు పడిందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!