Pemmasani: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా.. ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు హయంలో రాజధాని ప్రాంతంలో మూడు అద్భుతమైన యూనివర్సిటీలను తీసుకొచ్చారు. కానీ, ప్రస్తుతం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది అని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Read Also: Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టింది..
Also Read
చంద్రబాబు, లోకేష్, నేను ఉన్నంత వరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని నేను.. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను.. అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగు పెట్టానన్నారు. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్లలో నా వల్ల ఈ ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇస్తున్నానని పెమ్మసాని పేర్కొన్నారు.
Read Also: Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!
ఇక, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడితో పాటు అంతకు ముందు ఉన్న సీఎంలు తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసమే అన్నారు. బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టీడీపీ హయంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటు పడిందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!