Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ.. దేవుళ్లకే శఠగోపం పెట్టిన బీజేపీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిర్మల్ జిల్లా లో లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి, కూలీలతో సమావేశం అయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వంద రోజులు పనికి గత పది ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వ కూలీ పెంచలేదని అన్నారు.
Read also: Stock Market Down: ఉన్నట్లుండి కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 750పాయింట్లు డౌన్
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
అంతే కాకుండా పేదల ఉపయోగించి వస్తువులపైన పన్నులు వేసి పీడుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తప్ప గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎక్కడా చేయలేదన్నారు. అయోధ్య రాముడు పేరుతో దేశంలో అన్ని కుటుంబాల నుంచి లక్షల కోట్లు చందాలు వలసూలు చేసి, ఖర్చు పెడుతున్నారే గాని, తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రాముడికి మొండి చేయి చూపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ఆర్టీసీ చార్జీలు పెంచారు. పేదలు ఉపయోగించే ప్రయాణ వాహనాలకు భారంగా మార్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.
Read also: Pawan Kalyan :సీన్ లోకి హరిహర వీరమల్లు.. మరి ‘ఓజి’ రిలీజ్ పరిస్థితి ఏంటి..?
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేంద్రంలో కొత్త నిబంధనాలతో ఉద్యోగుల భద్రత లేకుండా చేశారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మహిళా సంఘాలకు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాం అన్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు ఉపయోగపడనంగా చేస్తామని అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు గాని, కొత్త పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేయలేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం పేదల కోసం అనేక పోరాటాలు చేశారు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు ఏనాడు పదవికి ఆశపడలేదు. రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇచ్చి పేదల అభివృద్ధికి తోడు అవుదాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు.
Padma Rao Goud: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ది చేశాం..
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!