Pemmasani: జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న పెమ్మసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నాగభైరవ పాలెం, జరుగు వారి పాలెం, ఉప్పలపాడు, పరిటాల వారి పాలెం, అన్నవరం, రాజుపాలెం, పాలపర్రు, అభినయని గుంట పాలెం, గిరిజవోలు గుంట పాలెం, గోగులమూడి, కాట్రపాడు, కుసులూరు గ్రామాల్లో పర్యటించారు. కాగా ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు. అలాగే, రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు, మిర్చి, టమాటో ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభతరమయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ కు అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని స్పష్టం చేశారు.
Read Also: DC vs MI: సొంత గడ్డలో వీరవిహారం చేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 258..
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
అలాగే, గుంటూరులోని అమరావతి రోడ్డులో గల స్వగృహ కన్వెన్షన్లో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఎన్డీయే కూటమికి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. టీడీపీ మాత్రమే ఒక ఎర్రన్నాయుడుని, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి లాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసిందన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీసీ సంఘాల నాయకులందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన అంశం అని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!