Payyavula Keshav: జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటాం..
- వైఎస్ జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్
- శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేసిన పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ రోజు శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు.. అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించిన పయ్యావుల.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఇక, మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతాం అన్నారు.. వైఎస్ జగన్ సభకు రావాలని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలనే తాము కోరుకుంటామని తెలిపారు.. ఇక, స్వపక్షమైనా.. విపక్షమైనా మేమే.. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్దంగా ఉంటామని వెల్లడించారు మంత్రి పయ్యావుల కేశవ్.
Read Also:Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
Also Read
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
మొదట శాసనసభ ప్రాంగణంలో ఉన్న టీడీఎల్పీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన పయ్యావుల కేశవ్.. ఆ తర్వాత శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు.. మరోవైపు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రి పయ్యావులకు వివరించారు సెక్రటరీ కేవీవీ సత్యనారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలో శ్వేత పత్రం విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.. అన్ని రకాల అప్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఓ నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.
తాజావార్తలు
-
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
-
KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
-
Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్ల వెనుక అసలు కథ ఇదే!
-
TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!