Payyavula Keshav: జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటాం..
- వైఎస్ జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్
- శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేసిన పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payyavula Keshav: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ రోజు శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు.. అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించిన పయ్యావుల.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఇక, మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతాం అన్నారు.. వైఎస్ జగన్ సభకు రావాలని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలనే తాము కోరుకుంటామని తెలిపారు.. ఇక, స్వపక్షమైనా.. విపక్షమైనా మేమే.. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్దంగా ఉంటామని వెల్లడించారు మంత్రి పయ్యావుల కేశవ్.
Read Also:Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
మొదట శాసనసభ ప్రాంగణంలో ఉన్న టీడీఎల్పీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన పయ్యావుల కేశవ్.. ఆ తర్వాత శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు.. మరోవైపు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రి పయ్యావులకు వివరించారు సెక్రటరీ కేవీవీ సత్యనారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలో శ్వేత పత్రం విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.. అన్ని రకాల అప్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఓ నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!