Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజులపాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. తొలి విడతలో ఐదు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు.
Read Also: K.Keshava Rao : నేను 55 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా.. నన్ను cwc మెంబర్గా చేసింది కాంగ్రెస్
పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూజలు చేయించనున్నారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శించనున్నారు. తొలి విడత ప్రచారంలో ఐదు రోజు అక్కడే బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న పవన్ ప్రచారం చేయనున్నారు. మనోహర్తో కలిపి సభలో పాల్గొననున్నారు.
పవన్ కల్యాణ్ తొలి విడత ప్రచార షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – యలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
ఏప్రిల్ 10 – రాజోలు
ఏప్రిల్ 11 – పి.గన్నవరం
ఏప్రిల్ 12 – రాజానగరం.