Pawan Kalyan: కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి.. పాలకొండను బంగారుకొండ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan, Janasena, Varahi Vijaya Yatra, Palakonda, AP Elections 2024, Andhra Pradesh, Telugu NewsPawan Kalyan:సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలని.. తెగించి పోరాడాలని.. 1960లో బామిని మండలంలోదోపిడీదారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర యువత తిరగబడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్కు చెప్పాలన్నారు. గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని.. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుందన్నాపు. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర యాస అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన చిత్రాల్లో పాటలు కూడా ఉన్నాయన్నారు.
జగన్ సిద్ధం సిద్ధం అంటున్నారు.. దేనికి సిద్ధమని పవన్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేవు , మద్యం రేట్లు పెంచారన్నారు. గిరిజన యువతికి ట్రైకార్ నిధులు లేవన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో దాదాపు 2 వేల కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత ఆయన విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
Read Also: Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం
పాలకొండ డివిజన్లో ఏనుగుల బెడద అధికంగా ఉందని.. ఆస్తి , ప్రాణ నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక గజరాజులతో జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని పవన్ హమీ ఇచ్చారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తామన్నారు.పదవీ విరమణ తరువాత ఉద్యోగులు భయపడకూడదని.. సీపీఎస్ లేదా తత్సమాన పరిష్కారం అందిస్తామన్నారు. ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ సమష్యలకు సంపుర్ణ పరిష్కారం వచ్చేంత వరకూ కృషి చేస్తామన్నారు. జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు సరిపోదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలను కోరారు. పాలకొండను బంగారుకొండ చేసుకుంటామన్నారు. దశాబ్దం తరువాత ఆభ్యర్థిస్తున్నా , అర్థిస్తున్నా , కూటమి అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!