NTV Telugu Site icon

Pawan Kalyan: అయోధ్య ప్రాణ ప్రతిష్ట.. లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Reached Lucknow

Pawan Kalyan Reached Lucknow

Pawan Kalyan: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు.

Read Also: DNS : ఆ క్రేజీ మల్టీ స్టారర్ మూవీకి మ్యూజిక్ ఇవ్వనున్న రాక్ స్టార్..

ఇది ప్రజల చిరకాల స్వప్నమని.. 500 ఏళ్ల తరువాత ఇది ఎట్టకేలకు నిజం కాబోతోందని, మేము చాలా సంతోషంగా ఉన్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.