Pawan Kalyan : వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే.. ఈనేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ వెనకడుగు వేసిన సందర్భంలో ఇప్పటం గ్రామమే జనసేనకు అండగా నిలబడిందని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఇప్పటం గ్రామం ఇచ్చిందన్నారు. ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చిన వైసీపీ గడప కూల్చే వరకు పోరాటం చేస్తామని, రోడ్ల విస్తరణ చేస్తే అన్ని ఇళ్లు కూల్చాలి.. కానీ కొందరివే ఎందుకు కూల్చారన్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటం గ్రామస్తులు తెగువ అమరావతి ప్రజలు చూపించి ఉంటే.. అమరావతి వెళ్లేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇప్పటం గ్రామానికైన గాయానికి జనసేన మందు రాస్తుంది. ప్రజల గుండెల్లో స్థానం కంటే ఏ ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు.
Also Read : Ind vs Nz: రెండో వన్డే వర్షార్పణం.. 1-0 ఆధిక్యంలో కివీస్
వైసీపీ 30 ఏళ్ల అధికారంలో ఉండాలని కోరుకుంటే నేను 30 ఏళ్లల్లో ప్రజలు ఎదగాలని కోరుకుంటా. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు వెనుక డిఫ్యాక్టో సీఎం సజ్జల ఉన్నారు. అధికారం అంటే అహంకారం కాదని సజ్జల తెలుసుకోవాలి. రేపటి నుంచి నన్ను తిట్టిస్తారా నాపై దాడులు చేయిస్తారా చేయించుకోండి నేను బెదరను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైసీపీ నేతల ఇళ్లూ కూలుస్తాం. లీగలుగా ఎలా కూల్చాలో మీరు చెప్పారుగా.. మేమూ లీగలుగానే చేస్తాం. కోడి కత్తితో గీకుంచుకుని రాజకీయ డ్రామాలు చేయటం వైసీపీ పని. వైసీపీకి సంస్కారవంతమైన రాజకీయాలు పని చేయవు. వివేకాను హత్య చేయించిన వారిని తమ వెనుక తిప్పుకుంటున్న వారు కూడా జనసేనను రౌడీ సేన అంటున్నారు. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. ప్రభుత్వం దృష్టిలో మేం రౌడీలమేమో కానీ.. ప్రజల దృష్టిలో మేం విప్లవ వీరులం. అనంతలో వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో.. మీడియాలో చూస్తున్నా. వైసీపీ నేతలా..? వైసీపీ టెర్రరిస్టులా..? రాజకీయం మీరే చేయాలా..? మేం చేయకూడదా..? వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం’ అంటూ ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..