Pawan Kalyan: తెలంగాణ రావడానికి జగన్ కారణం
విశాఖలోని జగదాంబ సెంటర్ లో మూడో వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు జనసైనికులు భారీగా తరలివచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పోరాడటానికి విశాఖ దైర్యం ఇచ్చిందని అన్నారు. ఏమి మాట్లాడతాడో చూద్దాం అనుకుంటున్న వైసీపీ నాయకులకి నమస్కారాలు అంటూ మొదలుపెట్టారు. ప్రొద్దునే పథకం కింద డబ్బులు ఇస్తారు.. సాయంత్రం సారా కింద డబ్బులు లాగేసుకుంటుందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు గుండాలు, రియల్ ఎస్టేట్ రాబందుల చేతులలో విశాఖ ఇరుక్కుపోయిందని ఆరోపించారు. వారి తోలు తీయడానికి పవన్ కళ్యాణ్ మీ కోసం ఉన్నారని తెలిపారు. గుండాల కాలుకి కాలు, కీలుకి కీలు తీసే ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Cab Driver Attack: మహిళను, ఆమె కొడుకును చితకబాదిన క్యాబ్ డ్రైవర్.. ఏం జరిగిందంటే?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అంతేకాకుండా.. ప్రాణాలు తెగించే పోరాటానికి సిద్ధం అయ్యానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేసే వరకు జనసేన పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారని.. తెలంగాణ రావడానికి జగన్ కారణమని పవన్ పేర్కొన్నారు. మరోవైపు ఋషి కొండను ఎలా తవ్వేశారని పవన్ ప్రశ్నించారు. ఎర్ర మట్టి దిబ్బలు చెక్కేశారని.. దానిని పది మంది దోచేస్తున్నారని తెలిపారు. విశాఖ వాసులు పెట్టిన పరీక్షకు నిలపడ్డానని.. ఓడిపోయిన తనను విశాఖ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పవన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ముప్పై వేలు మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటే వైసీపీ గుండాలు మాట్లాడారన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అదే చెప్పారని.. ఏపీలో చైల్డ్ హ్యూమన్ ట్రాకింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో విశాఖ ముందు ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో