Hardeep Nijjar Killing: నిజ్జర్ హత్యలో విచారణ ముగ్గురికే పరిమితం కాదు.. కెనడా పీఎం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Nijjar Killing: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య ఇంకా ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది. గతేడాది సర్రే నగరంలో గురుద్వారా సమీపంలో నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ కేసును విచారించిన కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను విచారిస్తు్న్నారు. వీరికి ఈ హత్యతో సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా?? లేదా.? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యకు సంబంధించి విచారణ ముగ్గురికే పరిమితం కాదని ఆదివారం అన్నారు. కెనడా ఒక రూల్ ఆఫ్ లా దేశమని చెప్పారు.
Read Also: Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ముగ్గురు భారతీయుల్ని అరెస్ట్ చేసిన తర్వాత కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో నిజ్జర్ మృతిపై పీఎం ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కెనడా ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా మరోసారి ఈ హత్యపై ట్రూడో మాట్లాడుతూ..‘‘కెనడా బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటు తన పౌరులందరినీ రక్షించడానికి ప్రాథమిక నిబద్ధతతో కూడిన నియమావళి దేశం. చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా సిక్కు సంఘం సభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నాకు తెలుసు.’’ అని అన్నారు. కెనడియన్లకు వివక్ష, హింస లేకుండా సురక్షితంగా జీవించే హక్కు ఉందని, మన ప్రజాస్వామ్య సూత్రాలు, మన న్యాయ వ్యవస్థ పట్ల నిబద్ధతతో స్థిరంగా, శాంతంగా ఉండాలని కోరారు.
అయితే, ముగ్గురు భారతీయుల అరెస్టుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కెనడా వ్యవస్థీకృత నేరాల్లో సంబంధాలు ఉన్న వ్యక్తులకు వీసాలు ఇస్తోందని మండిపడ్డారు. కెనడాలో పాకిస్తాన్ అనుకూల వైఖరితో కొందరు వ్యక్తులు రాజకీయంగా సంఘటితమై ప్రభావవంతమైన రాజకీయ లాబీని నడుపుతున్నారని జైశంకర్ అన్నారు. ముగ్గురి అరెస్ట్ చేసినట్లు నివేదికలు చూశామని, కెనడియన్ పోలీసులు విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..