Hardeep Nijjar Killing: నిజ్జర్ హత్యలో విచారణ ముగ్గురికే పరిమితం కాదు.. కెనడా పీఎం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Nijjar Killing: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య ఇంకా ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది. గతేడాది సర్రే నగరంలో గురుద్వారా సమీపంలో నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ కేసును విచారించిన కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను విచారిస్తు్న్నారు. వీరికి ఈ హత్యతో సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా?? లేదా.? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యకు సంబంధించి విచారణ ముగ్గురికే పరిమితం కాదని ఆదివారం అన్నారు. కెనడా ఒక రూల్ ఆఫ్ లా దేశమని చెప్పారు.
Read Also: Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ముగ్గురు భారతీయుల్ని అరెస్ట్ చేసిన తర్వాత కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో నిజ్జర్ మృతిపై పీఎం ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కెనడా ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా మరోసారి ఈ హత్యపై ట్రూడో మాట్లాడుతూ..‘‘కెనడా బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటు తన పౌరులందరినీ రక్షించడానికి ప్రాథమిక నిబద్ధతతో కూడిన నియమావళి దేశం. చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా సిక్కు సంఘం సభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నాకు తెలుసు.’’ అని అన్నారు. కెనడియన్లకు వివక్ష, హింస లేకుండా సురక్షితంగా జీవించే హక్కు ఉందని, మన ప్రజాస్వామ్య సూత్రాలు, మన న్యాయ వ్యవస్థ పట్ల నిబద్ధతతో స్థిరంగా, శాంతంగా ఉండాలని కోరారు.
అయితే, ముగ్గురు భారతీయుల అరెస్టుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కెనడా వ్యవస్థీకృత నేరాల్లో సంబంధాలు ఉన్న వ్యక్తులకు వీసాలు ఇస్తోందని మండిపడ్డారు. కెనడాలో పాకిస్తాన్ అనుకూల వైఖరితో కొందరు వ్యక్తులు రాజకీయంగా సంఘటితమై ప్రభావవంతమైన రాజకీయ లాబీని నడుపుతున్నారని జైశంకర్ అన్నారు. ముగ్గురి అరెస్ట్ చేసినట్లు నివేదికలు చూశామని, కెనడియన్ పోలీసులు విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..