Parliament sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. కీలక బిల్లులపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. శీతాకాల సమావేశాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. సాధారణంగా సెషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తారు. అయితే ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 2వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ ఫలితాలు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, ఈ సెషన్లో అనేక ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే మరింత బలం పుంజుకుంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పార్లమెంటులో సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. మహువా మోయిత్రాపై ఎథిక్స్ కమిటీ నివేదిక కూడా ఈ సెషన్లో సమర్పించనున్నారు. నగదు, బహుమతుల కోసం పార్లమెంట్లో గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని మహువా మోయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది. ఇప్పుడు దీన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.
Read Also: Harish Rao: ఓట్ల కోసం కాదు ప్రేమతో ఇచ్చాం.. రైతు బంధు ఆపిందే కాంగ్రెస్సే.
అలాగే, పార్లమెంటులో ఈ నివేదికను ఆమోదించిన తర్వాత, మహువా మొయిత్రాను పార్లమెంటు నుండి బహిష్కరించడం ఖాయమవుతుంది. ఈ సెషన్లో ఇండియన్ జస్టిస్ కోడ్తో సహా మూడు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీతో పాటు ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకు ఇప్పటికే హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ లో ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందు ముగియనున్నాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా మొదలవుతున్నది. ఎప్పటి లాగే క్రిస్మస్ పండుగకు ముందు ఈ సెషన్స్ ముగియనున్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!