Success Story : విదేశాల్లో చదవలేదు.. పెద్ద డిగ్రీలు లేవు.. కానీ రూ.8000కోట్ల వ్యాపార సామ్రాజ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story : వ్యాపారం చేయడం, దానిని విజయవంతం చేయడం.. అంటే ఒక నదికి రెండు చివరలు లాంటివి. ఈ రెండు చివరలను అనుసంధానించే వ్యక్తి మాత్రమే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు. పార్లే ఆగ్రో యజమాని నదియా చౌహాన్ అటువంటి దానికి ఉదాహరణగా నిలిచారు. నదియా విదేశాల్లో చదవలేదు లేదా పెద్ద డిగ్రీని పొందలేదు. కేవలం తన తండ్రి ఇచ్చిన అనుభవంతో రూ.300 కోట్ల విలువైన కంపెనీని రూ.8000 కోట్ల క్యాపిటల్గా మార్చాడు.
నదియా 2003లో తన తండ్రి ప్రకాష్ చౌహాన్తో కలిసి పార్లే ఆగ్రో కంపెనీలో చేరారు. అప్పట్లో కంపెనీ టర్నోవర్ రూ.300 కోట్లు మాత్రమే. 2017 సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం రూ.4,200 కోట్లకు చేరుకోగా, 2022-23లో రూ.8,000 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ విజయం వెనుక ఉన్నది కేవలం నదియా తెలివితేటలే అని చెబుతున్నారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Read Also:Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్ఫర్
నదియా చిన్నప్పటి నుండి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించింది. ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన ఖాళీ సమయాన్ని తన తండ్రితో గడపడం ప్రారంభించింది. 37 ఏళ్ల నదియా ప్రస్తుతం కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె అక్క షానా చౌహాన్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
నదియా జన్మించిన 1985 సంవత్సరంలో పార్లే ఆగ్రో కంపెనీ కూడా ప్రారంభమైంది. ఆ సమయంలో అతని తండ్రి ప్రకాష్ చౌహాన్ స్వీడిష్ కంపెనీకి చెందిన మామిడి ఉత్పత్తులను టెట్రా ప్యాక్లలో తయారు చేసేవారు. నదియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 17 సంవత్సరాల వయస్సులో కంపెనీలో చేరారు. కంపెనీ సంపాదనలో 95 శాతం ఫ్రూటీ అనే ఒక ఉత్పత్తి నుండి మాత్రమే వచ్చినట్లు ఆమె కనుగొన్నారు.
Read Also:IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్ట్.. ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం!
నదియా ఇతర ఉత్పత్తుల వైపు తన దృష్టిని పెంచుకుంది. 2005 సంవత్సరంలో Appy Fizzని ప్రారంభించింది. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఉత్పత్తిగా మారింది. దీని తరువాత ఆమె కంపెనీ దేశంలోని మొట్టమొదటి నిమ్మరసంతో సహా అనేక ఇతర ఉత్పత్తులను ప్రారంభించింది. దీని తర్వాత, తన సోదరితో కలిసి తాను అనేక తయారీ యూనిట్లను స్థాపించారు. ఉత్పత్తిని పెంచడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!