Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్ఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు. అందులోనూ ప్రధానంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా.. 13 మంది ఐపీఎస్లు, ఎక్సైజ్ శాఖలో వివిధ స్థాయిల్లో ఉన్న 105 మందిని బదిలీ చేసింది. 10 మంది అదనపు ఎస్పీలతో పాటు 95 మంది డీఎస్పీలు, ఏసీపీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఎన్ఎస్ మోహనరాజా, రామగుండం అదనపు డీసీపీ (ఆపరేషన్స్) వీ.శ్యామ్ బాబు, సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ టీ. స్వామి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి, జెన్కో అడిషనల్ ఎస్పీ డి ప్రతాప్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అదనపు ఎస్పీగా ఆర్ సుదర్శన్ ఉన్నారు.
Reada also: Telangana Weather Today: తెలంగాణలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ఆక్టోపస్ అదనపు ఎస్పీగా కె.గంగారెడ్డి, హైదరాబాద్ సిటీ-1 అదనపు డీఎస్పీగా ఎస్.రంగారావు, భూపాలపల్లి అదనపు డీసీపీగా నరేష్ కుమార్, ఆక్టోపస్ అదనపు ఎస్పీ హనుమంతరావులను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జిందర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. ఏసీపీ సీహెచ్ శంకర్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా బదిలీ చేస్తూ.. ఏసీపీ సామల వెంకట రెడ్డిని సుల్తాన్ బజార్ కు ప్రభుత్వం బదిలీ చేసింది. అంబర్ పేట్ డీఎస్పీ జి.జగన్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా బదిలీ చేయగా, ఆ స్థానంలో ఉన్న ఏసీపీ ఎస్ సైదయ్యను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక.. టీఎస్ ట్రాన్స్ కో డీఎస్పీ కె.శివరాంరెడ్డిని కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను ఎస్డీపీఓగా బదిలీ అయ్యారు. డీఎస్పీ కృష్ణయ్యను ఎల్బీనగర్ ఏసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
Komuravelli Railway Station: నేడు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్.. నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమిపూజ
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!