Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్ఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు. అందులోనూ ప్రధానంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా.. 13 మంది ఐపీఎస్లు, ఎక్సైజ్ శాఖలో వివిధ స్థాయిల్లో ఉన్న 105 మందిని బదిలీ చేసింది. 10 మంది అదనపు ఎస్పీలతో పాటు 95 మంది డీఎస్పీలు, ఏసీపీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఎన్ఎస్ మోహనరాజా, రామగుండం అదనపు డీసీపీ (ఆపరేషన్స్) వీ.శ్యామ్ బాబు, సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ టీ. స్వామి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి, జెన్కో అడిషనల్ ఎస్పీ డి ప్రతాప్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అదనపు ఎస్పీగా ఆర్ సుదర్శన్ ఉన్నారు.
Reada also: Telangana Weather Today: తెలంగాణలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ఆక్టోపస్ అదనపు ఎస్పీగా కె.గంగారెడ్డి, హైదరాబాద్ సిటీ-1 అదనపు డీఎస్పీగా ఎస్.రంగారావు, భూపాలపల్లి అదనపు డీసీపీగా నరేష్ కుమార్, ఆక్టోపస్ అదనపు ఎస్పీ హనుమంతరావులను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జిందర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. ఏసీపీ సీహెచ్ శంకర్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా బదిలీ చేస్తూ.. ఏసీపీ సామల వెంకట రెడ్డిని సుల్తాన్ బజార్ కు ప్రభుత్వం బదిలీ చేసింది. అంబర్ పేట్ డీఎస్పీ జి.జగన్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా బదిలీ చేయగా, ఆ స్థానంలో ఉన్న ఏసీపీ ఎస్ సైదయ్యను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక.. టీఎస్ ట్రాన్స్ కో డీఎస్పీ కె.శివరాంరెడ్డిని కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను ఎస్డీపీఓగా బదిలీ అయ్యారు. డీఎస్పీ కృష్ణయ్యను ఎల్బీనగర్ ఏసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
Komuravelli Railway Station: నేడు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్.. నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమిపూజ
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?