Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం..
- బలం లేకున్నా ఎన్డీయే అభ్యర్థి విజయం..
- క్రాస్ ఓటింగ్తో విజయం సాధించిన పరిమల్ నత్వానీ..
- ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్డీయే మద్దతు కలిగిన అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. బలం లేకున్నా కూడా ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడం సీఎం హేమంత్ సోరెన్, ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పరిమల్ నత్వానీకి 28 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి. మరోవైపు, జేఎంఎం నిలబెట్టిన వైద్యనాథ్ రామ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
క్రాస్ ఓటింగ్ మధ్య జార్ఖండ్లోని రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ఎన్డీయే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి నత్వానీ గెలుపొందారు. నత్వానీకి 28 ఓట్లు రాగా, ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైద్యనాథ్ రామ్కు 30 ఓట్లు రాగా, మూడు చెల్లనివిగా తేలింది. జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ స్థానం గెలవాలంటే 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో, కనీసం 28 ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు కీలకం. నత్వానీకి 24 మంది బీజేపీ సభ్యుల మద్దతు ఉంది. మరో నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!