State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
State Planning Commission: రాష్ట్ర వ్యాప్త స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. మంగళవారం మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు వినోద్ కుమార్ ను కలిశారు. లోక్ సభ, రాజ్యసభలలో సిట్టింగ్, మాజీ ఎంపీల కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ గ్రూప్ ఉంటుందని, ఈ గ్రూప్ ద్వారా ఉభయ పార్లమెంటరీ సభల్లో జరిగే ముఖ్య ఘటనల సమాచారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు సభ్యుల సమాచారం కోసం ఈ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా పంచాయతీరాజ్ గ్రూప్ ఉండాల్సిన అవశ్యకత ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Read Also: G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
గ్రామ సర్పంచిగా, ఎంపిటిసి సభ్యులుగా, జెడ్పిటిసి సభ్యులుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి రిజర్వేషన్ రోష్టర్ వల్ల గానీ, ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల గానీ, తిరిగి పోటీ చేయలేక పోవడం వంటి పలు కారణాల వల్ల మాజీలుగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలకు అతీతంగా ఒకే వేదికగా ఉంచే విధంగా పంచాయతీ రాజ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు, స్థానిక సంస్థల సమగ్ర సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించేందుకు పంచాయతీ రాజ్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సమాచారాన్ని గ్రామస్థులకు చేరవేయడానికి పంచాయతీ రాజ్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు. పంచాయతీ రాజ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!