State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
State Planning Commission: రాష్ట్ర వ్యాప్త స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. మంగళవారం మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు వినోద్ కుమార్ ను కలిశారు. లోక్ సభ, రాజ్యసభలలో సిట్టింగ్, మాజీ ఎంపీల కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ గ్రూప్ ఉంటుందని, ఈ గ్రూప్ ద్వారా ఉభయ పార్లమెంటరీ సభల్లో జరిగే ముఖ్య ఘటనల సమాచారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు సభ్యుల సమాచారం కోసం ఈ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా పంచాయతీరాజ్ గ్రూప్ ఉండాల్సిన అవశ్యకత ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Read Also: G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్
Also Read
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
గ్రామ సర్పంచిగా, ఎంపిటిసి సభ్యులుగా, జెడ్పిటిసి సభ్యులుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి రిజర్వేషన్ రోష్టర్ వల్ల గానీ, ఎన్నికల్లో ఓటమి చెందడం వల్ల గానీ, తిరిగి పోటీ చేయలేక పోవడం వంటి పలు కారణాల వల్ల మాజీలుగా ఉంటున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పార్టీలకు అతీతంగా ఒకే వేదికగా ఉంచే విధంగా పంచాయతీ రాజ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వినోద్ కుమార్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ అంశాల ఉత్తర్వులు, స్థానిక సంస్థల సమగ్ర సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించేందుకు పంచాయతీ రాజ్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సమాచారాన్ని గ్రామస్థులకు చేరవేయడానికి పంచాయతీ రాజ్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ తెలిపారు. పంచాయతీ రాజ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!