G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20: తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ నెల 28నుంచి జూన్ 17మధ్య జీ20 సమావేశాలు విడతల వారీగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై డీజీపీ అంజన్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని జీ20 సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం జరుగనుందని డీజీపీ తెలిపారు. ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లో ఆరు సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల28న తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. మార్చిలో 6 , 7, ఏప్రిల్ లో 26 , 27, 28, జూన్ లో 7,8,9, జూన్ లో 15 , 16 ,17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారుల నుండి స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
Read Also:Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, వీఐపీలు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. ఎయిర్ పోర్టుతో పాటు నగరంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!