BJP Office : ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది: పంచాంగ శ్రవణం
- బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
- ప్రపంచానికి దిశా నిర్దేశనం స్థాయిలో భారత్
- ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉందన్నారు. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుందని తెలిపారు. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయని.. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుందని చెప్పారు. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులని.. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ అని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీలో భా అంటే కాంతి అన్నారు.. ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తున్నాయని హెచ్చరించారు. అలాంటి వాటన్నింటిని చెప్పే చిన్న పుస్తకమే పంచాంగమని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసే శక్తి భారత్ కే ఉందన్నారు.. జూలై చివర, ఆగస్టులలో విశేష వర్షాలు కురుస్తాయి వెల్లడించారు. వర్షాలు కురిసి ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉంటాయని.. కొద్దిపాటి ఇబ్బందులు విద్యార్థులకు వస్తాయన్నారు. జూన్, జులై, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలతో పాటు ఫిబ్రవరి 17 వరకు ముహుర్తాలు ఉండవని చెప్పారు. మహిళలకు ఈ ఏడాది బీజేపీ పెద్దపీట వేస్తుందని.. ప్రపంచ దేశాలకు భారత్ దేవాలయం అవుతుందని సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు.
READ MORE: CM Chandrababu: ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది..
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
పంచాంగ శ్రవణం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. “సూర్యనారాయణ మూర్తి పంచాంగ పఠనం విన్నాం. హిందువుల ప్రతి పండుగలో సైన్స్ ఉంటుంది, సందేశం ఉంటుంది. కులాలకు అతీతంగా, ధనిక పేద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకుంటాం. వచ్చే ఉగాది వరకు దేశం మరింత సస్యశ్యామలం కావాలని, దేశ ప్రతిష్ట మరింత పెరగాలని, మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్ళాలని, ప్రకృతి వైపరిత్యాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్న.. బీజేపీ నీ మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలి. రాష్ర్ట, జాతీయ కమిటీ లు త్వరలోనే వస్తాయి.. బీజేపీ ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ, మోడీ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!