Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి
- లైవ్ న్యూస్ మధ్యలోనే ఏడ్చేసిన మహిళా యాంకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద దెబ్బగా మారాయి. ఈ ఎటాక్ దెబ్బకు దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మరణించినట్టు సమాచారం.
Read Also: Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..
Also Read
ఈ దాడులలో పాకిస్తాన్లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ దాడులపై పాకిస్తాన్ మీడియాలో తీవ్ర ఉద్వేగం వ్యక్తమవుతోంది. అయితే, పాకిస్తాన్కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ లైవ్ న్యూస్ మధ్యలోనే ఏడవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత దాడులతో పాకిస్థాన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, తమను ఆదుకోవాలని ఆ యాంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నెటిజన్లు మాత్రం దీనిపై సూటిగా స్పందిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు. సామాన్య ప్రజలను మతం అడిగి కాల్చినప్పుడు ఎందుకు ఏడవలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
A Pakistani News Anchor Started Crying on Live TV after India's 🇮🇳 Operation Sindhoor against Pakistan 🇵🇰
~ What's your take on this 🤔 pic.twitter.com/BhJFkvih2C
— Richard Kettleborough (@RichKettle07) May 7, 2025
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!